You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేపాల్ వరదలు: 165మంది మృతికి, వందలమంది గల్లంతుకు కారణమైన వరద బీభత్సం -13 ఫోటోల్లో..
నేపాల్-టిబెట్ సరిహద్దులో ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు 165 మంది చనిపోయారని నేపాల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ ఎన్డీఆర్ఆర్ఎంఏ తెలిపింది.
826మంది ఆచూకీ లభించడంలేదని, వారిలో 529మంది పర్యటకులని తెలిపింది.
ఆచూకీ లభించనివారిలో దాదాపు 300మంది భారతీయులని నేపాల్ విదేశాంగమంత్రి చెప్పారు.
హిమపాతం వల్ల భోటేకోషి నదికి ఉపనదైన ల్హెందె నది ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. టిబెట్కు సరిహద్దుకు దగ్గరలోని తిమురే ప్రాంతానికి తొలుత వరదనీరు చేరింది. తర్వాత వరద వేగంగా దిగువ ప్రాంతాలవైపు వెళ్లింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)