ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఫైనల్ మ్యాచ్కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
లైవ్ కవరేజీ
'నన్ను వాళ్లు చంపినా చంపొచ్చు.. అయినా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాను' అని షేక్ హసీనా ఎందుకు అన్నారు?
ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం
ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?
సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...
జపాన్ భూకంపం: షాపింగ్ మాల్లో పేలుడు, కూలిన వంతెన, ఎంతటి విధ్వంసం జరిగిందంటే...
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?
వరదలో కొట్టుకుపోతున్న కారులోంచి అమాంతం దూకేశారు
ఫేస్బుక్లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images
ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.
"ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.
ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.
భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.
"ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్ను ఫేస్బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది
జపాన్లో 7.1 తీవ్రతతో భూకంపం, విధ్వంసాన్ని చూపే 9 ఫోటోలు...
10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?
రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?
జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?
అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు
ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?
ఒంటెలు కూడా తట్టుకోలేనంత వేడి.. చనిపోతున్న ఎడారి ఓడలు
నిరసనకారులపై ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ హామీ నోటిఫికేషన్ను రేపటిలోపు విడుదల చేయాలి- సీజేపీ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, దిల్లీలో యువత ఆందోళన(ఫైల్ ఫోటోె) నిరసనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు.
పార్టీ పత్రికా సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు తనను, తన సహచరులను కలిశారని ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సౌరవ్ దాస్ తెలిపారు.
"ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం రెండుమూడు గంటల పాటు జరిగింది. నిరసనకారులపై దాఖలైన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని హామీ ఇస్తూ బిహార్, అసోం ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల కాపీలను వారు షేర్ చేశారు’’ అని సౌరవ్ దాస్ చెప్పారు.
‘‘నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోరని కూడా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన వారందరినీ కూడా విడుదల చేస్తామని చెప్పారు’’ అని సౌరవ్ దాస్ వివరించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి ఇలాంటి హామీలతో కూడిన నోటిఫికేషన్లు రేపటిలోగా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా అంగీకరించిన భాషనే ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. ఏ నిరసనకారుడినీ ఒంటరిగా వదిలిపెట్టం. ఈ పోరాటంలో మనమంతా కలిసి ఉన్నాం’’ అని సౌరవ్ దాస్ అన్నారు.
‘పచ్చని గడ్డి రక్తంతో తడిసి ఎర్రగా మారింది’
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్కు బంగారు పతకం.. మను భాకర్కు కాంస్యం

ఫొటో సోర్స్, Sanket Wankhade/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, భారత యువ షూటర్ ఈశా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.
21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్కే పరిమితమైంది.
కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఈశా సింగ్కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
మరోవైపు, మ్యూనిచ్లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.
నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...
