కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. 'పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉండకూడదనుకున్న తల్లి', కానీ ప్రసవం తర్వాత ఏం జరిగింది?

  2. కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్

    నీట్, దిల్లీ, ఆందోళనలు

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, మోహన్ భగవత్(ఫైల్ ఫోటో)

    కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

    దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    "మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.

    ‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.

    శుక్రవారం దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  3. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి

    పాకిస్తాన్, ఆత్మాహుతి దాడి,  ఉగ్రవాదం

    ఫొటో సోర్స్, Abdul BASIT / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో 15మంది మృతి

    పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని టాంక్ జిల్లాలో ఉన్న సైన్యం, పోలీసుల సంయుక్త చెక్ పోస్టు మాంఝీ ఖేల్‌పై గురువారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులతో సహా మొత్తం 15 మంది మరణించారు.

    మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ అధికారి ఉన్నారు. ఈ దాడి అనంతరం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

    ‘‘ఉగ్రవాదులు మొదట చెక్‌పోస్ట్ భద్రతను ఛేదించుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఆ తర్వాత పారిపోతున్న మిలిటెంట్లను వెంబడించి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు’’ అని పాకిస్తానీ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తెలిపింది.

    ‘‘తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో చెక్‌పోస్ట్ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. 15 మంది చనిపోయారు. చెక్‌పాయింట్‌ పూర్తిగా ధ్వంసమైంది’’ అని ఐఎస్‌పీఆర్ తెలిపింది.

  4. పేపర్ లీక్‌ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కామెంట్లపై వివిధ పార్టీలు ఏమన్నాయి?

    ఆర్థికమంత్రి, విద్యావ్యవస్థ, ఆందోళనలు, దిల్లీ, జంతర్ మంతర్, నీట్

    ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్

    ప్రశ్నాపత్రాల లీకేజ్‌ను కొందరు విద్యార్థులు మరింత కష్టపడి చదవడానికి అవకాశంగా ఉపయోగించుకున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

    కాంగ్రెస్, కాక్రోచ్ జనతాపార్టీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా సహా పలు పార్టీలు తీవ్రంగా స్పందించాయి.

    ‘‘ఆ సంఘటన తర్వాత ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోతే, అరెస్టులు చేయకపోతే, మళ్లీ పరీక్ష నిర్వహించి ఉండకపోతే, ఫలితాలు వెంటనే విడుదల చేసి ఉండకపోతే ఇప్పుడు యువత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే స్థితిలో ఉండేది కాదు’’ అని ఏఎన్ఐతో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

    ‘పేపర్ లీక్ అయినప్పుడు మేం బాధపడ్డాం. కానీ తర్వాత దాన్ని అవకాశంగా తీసుకుని మరింత కష్టపడి చదివాం. బాగా రాణించాం’’ అని కొందరు విద్యార్థులు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు.

    దీనిపై కాంగ్రెస్ ‘ఎక్స్‌లో స్పందించింది. ఇవి బాధ్యతారాహిత్యమైన, సున్నితత్వంలేని మాటలని కాంగ్రెస్ విమర్శించింది.

    ‘‘21 మందికి పైగా యువత ప్రాణాలను బలిగొని, లక్షలమంది యువత నిరసనలకు కారణమైన ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం లెక్కించుకుంటోంది. పేపర్ లీకేజ్‌లను అరికట్టడంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. ఈ వ్యక్తులు దేశ విద్యావ్యవస్థను నాశనం చేశారు’’ అని కాంగ్రెస్ తన పోస్ట్‌లో పేర్కొంది.

    ‘‘ఆర్థికమంత్రి ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు’’ అని ఆప్ విమర్శించింది.

    పేపర్ లీకేజ్‌లు తీవ్రరూపం దాల్చిన ఒక క్యాన్సర్‌లాంటివి. ఝార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం దీన్ని నిర్మూలిస్తోంది. కానీ ప్రశ్నాపత్రాల లీకుల వల్ల ప్రయోజనాలున్నాయని బీజేపీ అంటోంది’’అని ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధికారిక ‘ఎక్స్’అకౌంట్‌లో రాసింది.

    ‘‘ఈ తర్కం ప్రకారం దేశంలోని పత్రాలన్నీ లీకవ్వాలి’’అని కాక్రోచ్ జనతాపార్టీ అధికార ప్రతినిధి అశుతోశ్ కాంకా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

  5. విలువైన సూచనలిచ్చినందుకు ధన్యవాదాలు - ప్రధాని మోదీ

    దిల్లీ, జంతర్ మంతర్, ఆందోళనలు, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ

    ఇన్‌స్టా‌గ్రామ్‌లో తాను షేర్ చేసిన వీడియోకు యువత నుంచి వచ్చిన స్పందనపై ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన వీడియోకు యువత అందించిన విలువైన సూచనలు, సానుకూల స్పందనపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

    ‘‘ధన్యవాదాలు మిత్రులారా. రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు’’ అని ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియోలో ప్రధాని తెలిపారు.

    నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పేపర్‌లీక్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గురువారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియోలో ప్రధాని ప్రకటించారు.

  6. దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?

  7. రద్దీగా ఉన్న రోడ్డులో 'స్పైడర్‌మ్యాన్'..

  8. 92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్

  9. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?

  10. 'జంతర్ మంతర్‌కు వెళ్తే చర్యలు తప్పవు': విద్యార్థులకు జేఎన్‌యూ, దిల్లీ యూనివర్సిటీ ఆదేశాలు

    నిరసనలు, సీజేపీ, జంతర్ మంతర్, దిల్లీ యూనివర్సిటీ, జేఎన్ ‌యూ

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీ యూనివర్సిటీ తర్వాత, ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలకు సంబంధించి తమ విద్యార్థులకు పలు సూచనలు చేసింది.

    దిల్లీలోని జంతర్ మంతర్ లేదా పరిసర ప్రాంతాల్లో నిర్వహించే ఎలాంటి సమావేశాలకు హాజరుకావద్దని తమ విద్యార్థులకు సూచించింది.

    దీనికిముందు దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) కూడా తమ విద్యార్థులకు ఇదే తరహా సూచనలు చేసింది.

    "జేఎన్‌యూ స్టూడెంట్ కమ్యూనిటీలోని సభ్యులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాం. బహిరంగ ప్రదర్శనలకు సంబంధించి భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, జంతర్ మంతర్ వద్ద లేదా పరిసర ప్రాంతాల్లో జరిగే సమావేశాలు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం" అని జేఎన్‌యూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

    "సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించండి. సోషల్ మీడియా నిబంధనల ఉల్లంఘలనకు పాల్పడితే ఆయా చట్టాలతో పాటు యూనివర్సిటీ నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది."

    ఇంతకుముందు దిల్లీ విశ్వవిద్యాలయం కూడా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొనవద్దని తమ విద్యార్థులకు సూచించింది.

    అయితే, ఈ ఆదేశాలపై లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, విద్యార్థులను విశ్వవిద్యాలయం బెదిరించలేదని అన్నారు.

  11. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?

  12. సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?

  13. మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?

  14. దోమలపై యుద్ధానికి రంగంలోకి సైన్యం, మిలటరీ డ్రోన్లు.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?

  15. కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రభుత్వంతో చర్చలు - సౌరవ్ దాస్

    నిరాహారదీక్ష, ప్రభుత్వం, ప్రతిపక్షం

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సౌరవ్ దాస్

    విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ డిమాండ్లన్నీ యథాతథంగానే ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. వాటిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.

    "తటస్థ వేదికపై చర్చలు జరపాలన్న మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. మాకు సంతోషంగా ఉంది. చర్చల కోసం కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేశారు. ప్రభుత్వం విశాల దృక్పథంతో మా ముందుకు వచ్చినందుకు, వీధుల్లోకి వచ్చిన ప్రజల మాట వినడానికి సుముఖంగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది" అని సౌరవ్ దాస్ చెప్పారు.

    "వారు జంతర్ మంతర్‌కూ వచ్చుండొచ్చు. కానీ మేమే ప్రత్యామ్నాయంగా తటస్థ వేదికను సూచించాం. వారు జంతర్ మంతర్‌కు రావడానికి సంకోచించవచ్చని మాకు అర్థమైంది. మేము చదువుకున్న, తెలివైన వ్యక్తులం. అందుకే ఈ తటస్థ వేదికను ప్రతిపాదించాం" అని ఆయన తెలిపారు.

    నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మరికొన్ని డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నెల రోజులకు పైగా దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు.

    అయితే ఈ డిమాండ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.

  16. సోనమ్ సర్ దీక్షను విరమించడం సంతోషంగా ఉంది - అభిజిత్ దీప్కే

    నిరాహార దీక్ష, జంతర్ మంతర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అభిజిత్ దీప్కే

    సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి తర్వాత తన నిరాహార దీక్షను విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.

    సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపై అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో ఓవీడియో విడుదల చేశారు.

    "సోనమ్ సర్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించడం మాకు ఉపశమనం, సంతోషాన్ని కలిగించింది. సర్.. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి, యావత్ దేశ మనస్సాక్షిని కదిలించారు. మీ జీవితం ఈ దేశానికి చాలా విలువైనది" అని అందులో రాశారు.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుందని తెలిపారు.

    నీట్-యూజీ పేపర్ లీక్‌కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు.

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఈ డిమాండ్‌కు మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

  17. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?

  18. జంతర్ మంతర్: వాష్‌రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..

  19. ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?

    సీజేపీ, నిరసనలు, చర్చలు

    ఫొటో సోర్స్, ANI

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

    అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.

    జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్‌కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.

    "కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."

    చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.

  20. ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు