భవానీపుర్లో మమత ఆధిక్యమెంత?

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారిపై దాదాపు 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా వార్తలలో నిలిచిన స్థానాలలో మమత పోటీ చేస్తున్న భవానీపుర్ కూడా ఉంది. ఈ నియోజకవర్గాన్ని మమతకు కంచుకోటగా పరిగణిస్తుంటారు.
అయితే ఈసారి మమతకు గట్టిపోటీ ఇచ్చేందుకు విపక్షనేత సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దింపింది. కిందటిసారి ఎన్నికలలో మమత నందిగ్రామ్లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అప్పుడు సువేందు అధికారి 2వేల ఓట్ల మెజారిటీతో మమతను ఓడించారు.
కానీ ఈసారి మమతకు గట్టిపట్టున్న భవానీపుర్లోనే సువేందు ఆమెపై పోటీకి దిగారు. దీంతోపాటు సువేందు తనకు బాగా పట్టున్న నందిగ్రామ్ నుంచి కూడా పోటీలో ఉన్నారు.



