You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన కేసు: బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ చెప్పిన సీఎం శివరాజ్ సింగ్

బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌కు పిలిపించి మాట్లాడారు. అనంతరం ఆయన కాళ్లు కడగడంతో పాటు పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యువకుడికి ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...

  2. జర్నలిస్టుల సమస్యలపై దిల్లీలో తెలంగాణ పాత్రికేయుల ధర్నా

    దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన జర్నలిస్టులు సోమవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.

    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసనను, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మారూఫ్ రజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జర్నలిస్టులు దిల్లీ వేదికగా ముందుండి పోరాడటాన్ని ఆయన అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టు ప్రతినిధులు కూడా ఈ ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు.

  3. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తప్పించండి: తెలంగాణ హైకోర్టు, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

    కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని ది హిందూ రిపోర్టు చేసింది.

    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలో జులై 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతలు చేపట్టిన స్థలం సర్వే నం.1, 2 పరిధిలోకి వస్తాయని, అది తమ భూమిగా చెబుతూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జులై 17న కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ప్రైవేటు స్థలాలు లేవని హైడ్రా స్పష్టం చేసింది.

    ‘‘ఇప్పటికే రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ 17వ తేదీన హైడ్రా భారీ బలగంతో వచ్చి ప్రహారీ, ఇతర నిర్మాణాలు కూల్చివేసింది’’ అని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.హరీశ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.

    లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, 2021లోనే హైకోర్టు తీర్పు చెప్పిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంపై గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా వివరించారు. దీనిపై జులై 27న మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

    హైడ్రా కమిషనర్‌పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయని తెలగాణ హైకోర్టు చెప్పినట్లు ది హిందూ రిపోర్టు చేసింది.

    ఈ నేపథ్యంలో పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేసి ఆ స్థాయి అధికారిని వేరొకర్ని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

  4. E20 వివాదం: ఎక్స్, మెటా, గూగుల్‌లపై సివిల్ దావాకు గడ్కరీకి హైకోర్టు అనుమతి

    సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

    లైవ్ లా వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం జస్టిస్ అభయ్ అహూజా ధర్మాసనం ఈ కేసును విచారించింది. గడ్కరీ తరఫున న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా హాజరై, ఈ దావా వేయడానికి కోర్టు అనుమతి కోరారు.

    దాంతో ఎక్స్, మెటా, గూగుల్‌తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేయడానికి కోర్టు గడ్కరీకి అనుమతినిచ్చింది. ఈ వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని, తనకు తగిన ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

    రూ. 11 కోట్ల నష్టపరిహారం డిమాండ్

    ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడ్డారంటూ ఈ పోస్టుల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ ప్రకటనల్లో అవినీతి, పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు, పదవి దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారనీ గడ్కరీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఇలాంటి 24 పోస్టులను గడ్కరీ తన పిటిషన్‌లో ప్రస్తావిస్తూ, వాటిని తొలగించాలని కోరారు. తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తన గుర్తింపును, ప్రతిష్ఠను వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన వాదించారు. ఈ మేరకు రూ. 11 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

    E20 కి వ్యతిరేకంగా పోరాడుదాం: కేజ్రీవాల్

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై ‘E20’ కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ "దేశ యువత ఒక అహంకార ప్రభుత్వాన్ని తలవంచేలా చేసింది, దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే E20 ఇంధనం సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి వాహనాలు పాడవుతున్నాయి" అన్నారు.

    "ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఈ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.

  5. పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?

  6. లంబర్ జాక్: మొద్దులు నరికే వరల్డ్ కప్‌లో రికార్డులు సృష్టించిన అమ్మాయి...

  7. కొత్త తరం ఆలోచనల్ని వాళ్లు అర్ధం చేసుకోలేకపోతున్నారు - సౌరవ్ దాస్

    జంతర్ మంతర్ దగ్గర నిరసన అనంతరం డ్యాన్స్ చేస్తూ పార్టీ చేసుకుంటున్నట్టు వైరల్ అయిన వీడియోపై కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు.

    "జెన్-జెడ్ , కొత్త తరం ఆలోచనా విధానాన్ని, భాషను ప్రభుత్వం, గోదీ యాంకర్లు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఇది మరోసారి స్పష్టం చేస్తోంది" అని సౌరవ్ దాస్ ‘ఎక్స్’లో రాశారు.

    ‘‘ఎన్నిరోజులు అవసరమైతే అన్నిరోజులు మేం వీధుల్లో కూర్చుని నిరసన తెలపగలం. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఆందోళన కొనసాగించగలం. చేతిలో కోల్డ్ కాఫీని పట్టుకుని కూడా ఉద్యమాన్ని నిర్వహించగలం. మార్పు కోసం పోరాడటానికి, గత తరాలు ఉద్యమకారుల గురించి ఊహించిన ఒకే రకమైన రూపంలో మనం కనిపించాల్సిన అవసరం లేదు. (ఎవరినీ ఎద్దేవా చేయడం లేదు)

    ఈ తరం ప్రత్యేకత ఇదే. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, పోరాట స్ఫూర్తితో ఉంటుంది. మమ్మల్ని ఒకే మూసలో బంధించడం సాధ్యం కాదు.

    అంకుళ్లు, ఆంటీలు ఎంత ఫిర్యాదుచేసినా ఈ తరంతో కలిసి జీవించడం, మమ్మల్ని అంగీకరించడం తప్పదు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో, జంతర్ మంతర్ దగ్గర నిరసన ముగిసిన తర్వాత సౌరవ్ దాస్ తన సహచరులతో పార్టీ చేసుకుంటూ, డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

    ఈ వీడియోను బీబీసీ ధృవీకరించలేదు.

  8. వయసు 92... 68 ఏళ్లుగా ఆపరేషన్లు చేస్తున్న సర్జన్

  9. గుండెకు స్టెంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?

  10. మగవాళ్లకు కనిపించని రంగులు మహిళలకు కనిపిస్తాయా?

  11. స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?

  12. పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

    ప్రశ్నపత్రాల లీకేజ్‌లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

    ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.

    ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

  13. దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందకరమైనది ఏదీ లేదు: మీరాబాయి చనూ

    గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చనూ స్వర్ణపతకం గెలుచుకుంది. దేశం కోసం స్వర్ణం సాధించడం కంటే ఆనందకరమైనది మరొకటి లేదని వరుసగా మూడోసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న అనంతరం మీరాబాయి చనూ చెప్పింది.

    "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది నా మూడో స్వర్ణ పతకం. మొత్తంగా ఇది నా నాలుగో పతకం. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకోవడంతో నా ప్రయాణం మొదలైంది" అని మీరాబాయి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    జుట్టులోని త్రివర్ణ పతాక రంగుల్లో క్లిప్పు పెట్టుకోవడానికి గల కారణాన్ని మీరాబాయి చెప్పింది.

    "ఈ త్రివర్ణ క్లిప్పులను నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. మన జాతీయ పతాకానికి ప్రాతినిధ్యం వహించేలా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఏదైనా తయారు చేయాలని అకస్మాత్తుగా అనిపించింది. అందుకే ఈ సీతాకోకచిలుక ఆకారపు క్లిప్పులను పోటీల ముందురోజు నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. త్రివర్ణ పతాకాన్ని నాతో పాటు తీసుకువెళ్లడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ నేను చాలా భావోద్వేగానికి లోనై చాలా ఏడ్చాను. అయితే భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ ఈ క్షణం నాకు అంతే ఆనందాన్ని కూడా ఇచ్చింది" అని మీరాబాయి తెలిపింది.

  14. కామన్‌వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ

  15. ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు

  16. ‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

  17. 'పాక్‌ పాలిత కశ్మీర్‌‌‌'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?

  18. సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?

  19. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది: అభిజీత్ దీప్కే

    కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ ఉదయం ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

    "మీ అందరి మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జంతర్ మంతర్ దగ్గర చివరి వరకు ఉన్నవారికి నిన్న వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పలేకపోయాను. దీనిపై మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా" అని వీడియోలో అభిజీత్ దీప్కే చెప్పారు.

    "మీకు తెలిసినట్టే నాకు టైఫాయిడ్ వచ్చింది. నిన్న నాకు జ్వరం చాలా ఎక్కువ కావడంతో ఇంటికి వచ్చేశాను. 37 రోజుల పాటు జంతర్ మంతర్‌ దగ్గర పోరాటం కొనసాగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దేశం కోసం మీరు చేసిన కృషిని నేను అభినందిస్తున్నాను" అని చెప్పారు.

    ఉద్యమాన్ని విమర్శించిన వారికి కూడా అభి.జీత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.

    ‘‘ 'మీరు సీరియస్‌గా లేరు, ఎలా నిరసన చేయాలో మీకు తెలియదు' అని మమ్మల్ని విమర్శించిన వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు మమ్మల్ని ప్రశ్నించకపోయి ఉంటే లోపాలను సరిదిద్దుకునే అవకాశం మాకు వచ్చేది కాదు" అని వీడియోలో మాట్లాడారు.

    ఇది ఆరంభం మాత్రమేనని,కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

  20. జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు ఎలా ఉందంటే....

    కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఆందోళన శనివారం రాత్రి ముగిసింది.

    నిరసనకారులు ఆ ప్రాంతాన్ని ఖాళీచేశారు. పోలీసుల మోహరింపు కొనసాగుతోంది.

    అయితే ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు అక్కడ మోహరించిన పోలీసుల సంఖ్య బాగా తగ్గింది.