You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.
లైవ్ కవరేజీ
లంబర్ జాక్: మొద్దులు నరికే వరల్డ్ కప్లో రికార్డులు సృష్టించిన అమ్మాయి...
సౌదీ-అమెరికా అణు ఒప్పందం: పాకిస్తాన్ గురించి వ్యక్తమవుతున్న ఆందోళనలేంటి?
వయసు 92... 68 ఏళ్లుగా ఆపరేషన్లు చేస్తున్న సర్జన్
గుండెకు స్టెంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్లో పాల్గొనవచ్చు?
స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?
పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
ప్రశ్నపత్రాల లీకేజ్లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.
ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఫ్రాన్స్లో కార్చిచ్చు, అధ్యక్షుడు మేక్రాన్ అత్యవసర సమావేశం
ఫ్రాన్స్లోని బోర్డో నగరానికి దగ్గరలో కార్చిచ్చు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పదివేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేలాదిమంది శ్రమిస్తున్నారు. 8,50,000మంది ఉండే నగరాన్ని ఖాళీ చేయించే అవకాశం అంతగా లేదని అధికారులు చెప్పారు. బోర్డోకు 15కిలోమీటర్ల దూరంలో మంటలు వ్యాపించాయి.
మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మానుయేల్ మేక్రాన్ అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
మంగళవారం నుంచి ఫ్రాన్స్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఫ్రాన్స్లోని గిరోండ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా పైరోక్యుములోనింబస్ అనే భారీ అగ్ని తుఫాన్ మేఘం ఏర్పడిందని నేషనల్ ఫైర్ఫైటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్రాన్స్(ఎఫ్ఎన్ఎస్పీఎఫ్) తెలిపింది.
కార్చిచ్చు ఫ్రాన్స్పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చెలరేగిన భారీ కార్చిచ్చుల్లో ఇదొకటి.
గత వారం నుంచి యూరప్లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.
అమెరికాలో కాల్పులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
అమెరికాలోని సియాటెల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని సియాటెల్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారని తెలిపింది.
నగరంలో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్లో ఈ కాల్పులు జరిగాయి.
కాల్పుల్లో గాయపడ్డ రెండేళ్ల బాలుణ్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. గాయపడ్డవారిలో 56ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
"సియాటెల్ సెంటర్లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. దయచేసి ఆ ప్రాంతానికి దూరంగా ఉండండి" అని సియాటెల్ పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.
ఘటనాస్థలంలో భారీగా పోలీసులు, అత్యవసర సర్వీసులుకు చెందిన వారిని మోహరించినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తోంది.
సియాటెల్ సెంటర్లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఆహార స్టాల్స్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఉంటాయి. దీనికి లక్షలాది మంది హాజరవుతారు.
అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వరుసగా పలుమార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సియాటెల్ టైమ్స్ తెలిపింది.
కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడి నుంచి పరుగులు తీశామని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్తో మాట్లాడిన పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
మొదట బాణాసంచా పేలుళ్లేమో అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులన్నారు.
‘‘అందరూ పరుగులు తీస్తుండంతో మేమూ వారితో పాటు పరుగెత్తాం. అక్కడి నుంచి దూరంగా వెళ్లాలనుకున్నాం. మేం ఎక్కడ ఉన్నామో తెలుసుకోడానికి స్పేస్ నీడిల్ వైపు చూశాను. నిజంగా చాలా భయమేసింది’’ అని ఓ మహిళ చెప్పారు.
కాల్పుల శబ్దం వినగానే తల్లిదండ్రులు భయపడిపోయారని, పిల్లల చేతులు పట్టుకుని ఎగ్జిట్ గేట్ వైపు పరుగులు తీశారని, అక్కడంతా భయాందోళన నెలకొందని స్థానిక వ్యాపారి చెప్పారు.
దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందకరమైనది ఏదీ లేదు: మీరాబాయి చనూ
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చనూ స్వర్ణపతకం గెలుచుకుంది. దేశం కోసం స్వర్ణం సాధించడం కంటే ఆనందకరమైనది మరొకటి లేదని వరుసగా మూడోసారి కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం గెలుచుకున్న అనంతరం మీరాబాయి చనూ చెప్పింది.
"నేను చాలా సంతోషంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్లో ఇది నా మూడో స్వర్ణ పతకం. మొత్తంగా ఇది నా నాలుగో పతకం. 2014 కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకం గెలుచుకోవడంతో నా ప్రయాణం మొదలైంది" అని మీరాబాయి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.
జుట్టులోని త్రివర్ణ పతాక రంగుల్లో క్లిప్పు పెట్టుకోవడానికి గల కారణాన్ని మీరాబాయి చెప్పింది.
"ఈ త్రివర్ణ క్లిప్పులను నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. మన జాతీయ పతాకానికి ప్రాతినిధ్యం వహించేలా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఏదైనా తయారు చేయాలని అకస్మాత్తుగా అనిపించింది. అందుకే ఈ సీతాకోకచిలుక ఆకారపు క్లిప్పులను పోటీల ముందురోజు నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. త్రివర్ణ పతాకాన్ని నాతో పాటు తీసుకువెళ్లడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ నేను చాలా భావోద్వేగానికి లోనై చాలా ఏడ్చాను. అయితే భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ ఈ క్షణం నాకు అంతే ఆనందాన్ని కూడా ఇచ్చింది" అని మీరాబాయి తెలిపింది.
కామన్వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ
ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు
‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ
అస్సాంలో వరద బీభత్సం, 66కి చేరిన మృతులు
అస్సాంలో వరద తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరో నలుగురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 66కి చేరినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.
పది జిల్లాల్లోని 810 గ్రామాలు ఇంకా వరదనీటిలో చిక్కుకుని ఉన్నాయని అందులో తెలిపింది. ఈ వరదల వల్ల దాదాపు 6.54 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
నిరాశ్రయులైన వారి కోసం వివిధ జిల్లాల్లో మొత్తం 274 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో సుమారు 19,000 మంది ఆశ్రయం పొందుతున్నారు.
ఎగువ అస్సాంలోని శివసాగర్ జోర్హాట్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. శివసాగర్ జిల్లాలో మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అస్సాం ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.
మరోవైపు, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఫోన్లో మాట్లాడారు. అస్సాంలో ఏటా రుతుపవనాల సమయంలో వరదలు సంభవిస్తుంటాయి,
అయితే, ఈసారి తీవ్ర వరదలకు నాగాలాండ్లోని మోన్ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్' కూడా ఓ కారణమని భావిస్తున్నారు.
'పాక్ పాలిత కశ్మీర్'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?
సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?
ఫ్రాన్స్, స్పెయిన్లో అడవులు, ఆవాసాలను కాల్చి బూడిద చేస్తున్న కార్చిచ్చు, 11 ఫోటోల్లో..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?
సముద్ర గర్భంలో దొరికిన 74 ఏళ్ల కిందటి విమాన ప్రమాద శకలాలు, నేటి సేఫ్టీ నిబంధనలకు ఈ యాక్సిడెంటే కారణమంటారు, ఎందుకంటే..
మనం మళ్లీ కలుస్తాం - ధర్మేంద్ర ప్రధాన్ను ఉద్దేశించి కొత్త విద్యాశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు తనకు అప్పగించడంపై ప్రధాని మోదీకి ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు చెప్పారు.
‘‘మోదీ ప్రభుత్వం గత పన్నెండేళ్లలో ఎన్నో చరిత్రత్మక విజయాలు సాధించింది. ప్రధాని మార్గదర్శకత్వంలో నా పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ప్రయత్నిస్తా’’అని ప్రహ్లాద్ జోషి చెప్పారు.
‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రస్థానం అనేక దశాబ్దాలనుంచి సాగుతోంది. దేశాభివృద్ధి విషయంలో ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన పదవీకాలంలో ధర్మేంద్ర ప్రధాన్ నూతన విద్యావిధానాన్ని విజయవంతంగా అమలుచేశారు. విద్యారంగంలో వందకు పైగా చిన్నా,పెద్దా సంస్కరణలు ప్రవేశపెట్టారు. జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన పదవి నుంచి వైదొలిగినప్పటికీ, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవను అది మరుగునపడనివ్వదు. దేశ అభివృద్ధి మార్గంలో మనం మళ్లీ కలుస్తాం’’ అని ప్రహ్లాద్ జోషి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.