You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్: 24 గంటల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు
భారత్లో గత 24 గంటల్లో 10,542 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 63,562.
లైవ్ కవరేజీ
‘18 నెలలు ప్రయత్నించినా పిల్లలు కలగలేదు’.. మగవాళ్లలో సంతానలేమి సమస్యలను పెద్దగా పట్టించుకోరెందుకు
రాహుల్ గాంధీ ధర్నా: మోదీ ఇంటి నుంచి ఛత్రసాల్ స్టేడియం వరకు.. మంగళవారం రాత్రి ఏం జరిగింది?
ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతల తరలింపు, కొందరి విడుదల
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.
లోక్కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసం ముందు వీరంతా ధర్నా చేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విపక్ష నేతలలో కొందరిని ఈ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఛత్రసాల్ స్టేడియంలో కాసేపు ఉంచిన తర్వాత పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తప్పుబట్టారు. "ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను అంగీకరించాలి. విద్యార్థులు, యువతపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. వారిని కొట్టారు, తలలు పగలగొట్టారు.. చివరికి విద్యార్థినుల బట్టలు కూడా చింపేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నుంచి ఆశించే ప్రవర్తన ఇదేనా? మేం ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతాం" అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "మన దేశ భవిష్యత్తైన పిల్లల మాట వినడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? వారి డిమాండ్ చాలా న్యాయమైంది. ప్రజాప్రతినిధులుగా వారి గొంతుకను వినిపించడం, బలోపేతం చేయడం మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు. ఎక్కడ అవసరమైతే అక్కడ మా గొంతు వినిపిస్తాం. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుంచి మేం ఒకే మాటపై ఉన్నాం. కుప్పకూలిన విద్యా వ్యవస్థను సరిచేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పార్లమెంట్లో దీనిపై చర్చ జరగాలి. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక బిల్లును ఎందుకు తీసుకురావడం లేదు?" అని తెలిపారు.
"ప్రభుత్వం నిన్న తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. ఈ రోజు కూడా అదే క్రూరత్వాన్ని పునరావృతం చేసింది. వీరు పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకులు. జితేంద్ర సింగ్ మాకు నోటీసు ఇవ్వమని, ఆ తర్వాత చర్చ గురించి ఆలోచిస్తామని చెప్పారు; కానీ మాకు అది ఇష్టం లేదు. మేం నిన్న నోటీసు ఇచ్చాం, ఈ రోజు కూడా ఇచ్చాం" అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం
నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?
ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి భేటీ
దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం '7 లోక్ కల్యాణ్ మార్గ్' వెలుపల రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను కలవడానికి కొద్దిసేపటి కిందట కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడకు చేరుకున్నారు. ధర్నా స్థలం నుంచి వస్తున్న దృశ్యాలలో జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో మాట్లాడుతుండటం కనిపించింది.
రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ "నిన్న విద్యార్థులపై జరిగిన క్రూరమైన దాడికి సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం రాబట్టేందుకు మేం ఆయన ఇంటి వరకు మార్చ్ నిర్వహించాం. ప్రభుత్వం జవాబుదారీతనం వహించడానికి ఇష్టపడట్లేదు. పార్లమెంట్లో దీనిపై చర్చను కూడా కోరుకోవట్లేదు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలి" అని తెలిపారు.
మరోవైపు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనను కొనసాగిస్తోంది. సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' పై సోమవారం లాఠీచార్జ్ జరిగింది. ఈ ఘటనలో పలువురు యువకులు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి ఒక ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటన ప్రధాని మోదీ నుంచి నేరుగా రాలేదు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ద్వారా వచ్చింది.
ఆమె వయసు 103 ఏళ్లు, భూమి కోసం 32 ఏళ్లుగా న్యాయపోరాటం చేసి చివరకు సాధించారు...
ఒకే కాన్పులో ఒకేలా ఉన్న నలుగురు శిశువుల జననం
పదేళ్ల బాలుడి పురుషాంగంలో కొంత భాగం తొలగించడానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమేనా?
'ఆడపిల్లలపై లాఠీ ఎత్తితే, నేను లాఠీ పడతా. కేసు పెట్టుకో'
బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్నామ్, మొదటి ప్రసంగంలో ఏమన్నారంటే..
నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ ప్రకటన
సీజేపీ నిరసనలు: మద్దతుదారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్.. పార్లమెంట్ దగ్గర ఏం జరిగింది?
జంతర్ మంతర్ నుంచి తమ వేదికను పోలీసులు తొలగించారన్న కాక్రోచ్ జనతా పార్టీ, నిరాహార దీక్ష కొనసాగిస్తానన్న సోనమ్ వాంగ్చుక్
‘నేను గర్భం దాల్చినట్లు నాకంటే ముందు నా ఫిట్నెస్ ట్రాకర్కు తెలిసింది’
హార్ముజ్పైనే పీటముడి.. నిలవని ఒప్పందం ఏం చెబుతోంది?
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ వశం
‘మా కుటుంబాన్ని ఆదుకోవడానికి అక్క లండన్కు వెళ్లింది, కానీ ఆమెకు జరిగింది మరెవరికీ జరగకూడదు’
రోహిత్ శర్మ: హిట్మ్యాన్ 'రిటైర్మెంట్' ఊహాగానాలకు బీజం పడింది ఎక్కడ?