వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని 25 వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిలు వ్యాజ్యంపై వరుసగా రెండో రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.

లైవ్ కవరేజీ

  1. 'పాక్‌ పాలిత కశ్మీర్‌‌‌'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?

  2. సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?

  3. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?

  4. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?

  5. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు

    విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి

    ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్‌ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు

    కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

    ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

    జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్‌ఫోలియో కూడా ఉంది.

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

  6. సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?

  7. 'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే

  8. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...

  9. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే

    కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.

    ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

    ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.

    ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్‌లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.

  10. ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..

  11. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ

  12. సోనమ్ వాంగ్‌చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’

  13. ‘ఈ శతాబ్దపు విడాకులు’: ఈ కేసులో ఆ బిజినెస్ దిగ్గజం తన మాజీ భార్యకు ఎన్ని వేల కోట్లు చెల్లించాలంటే...

  14. 'పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉండకూడదనుకున్న తల్లి', కానీ ప్రసవం తర్వాత ఏం జరిగింది?

  15. దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?

  16. 92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్

  17. సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?

  18. 'జంతర్ మంతర్‌కు వెళ్తే చర్యలు తప్పవు': విద్యార్థులకు జేఎన్‌యూ, దిల్లీ యూనివర్సిటీ ఆదేశాలు

    నిరసనలు, సీజేపీ, జంతర్ మంతర్, దిల్లీ యూనివర్సిటీ, జేఎన్ ‌యూ

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీ యూనివర్సిటీ తర్వాత, ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలకు సంబంధించి తమ విద్యార్థులకు పలు సూచనలు చేసింది.

    దిల్లీలోని జంతర్ మంతర్ లేదా పరిసర ప్రాంతాల్లో నిర్వహించే ఎలాంటి సమావేశాలకు హాజరుకావద్దని తమ విద్యార్థులకు సూచించింది.

    దీనికిముందు దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) కూడా తమ విద్యార్థులకు ఇదే తరహా సూచనలు చేసింది.

    "జేఎన్‌యూ స్టూడెంట్ కమ్యూనిటీలోని సభ్యులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాం. బహిరంగ ప్రదర్శనలకు సంబంధించి భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, జంతర్ మంతర్ వద్ద లేదా పరిసర ప్రాంతాల్లో జరిగే సమావేశాలు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం" అని జేఎన్‌యూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

    "సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించండి. సోషల్ మీడియా నిబంధనల ఉల్లంఘలనకు పాల్పడితే ఆయా చట్టాలతో పాటు యూనివర్సిటీ నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది."

    ఇంతకుముందు దిల్లీ విశ్వవిద్యాలయం కూడా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొనవద్దని తమ విద్యార్థులకు సూచించింది.

    అయితే, ఈ ఆదేశాలపై లోక్‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, విద్యార్థులను విశ్వవిద్యాలయం బెదిరించలేదని అన్నారు.

  19. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?

  20. సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?