You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని 25 వరకు అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిలు వ్యాజ్యంపై వరుసగా రెండో రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది.

లైవ్ కవరేజీ

  1. దేశ రాజకీయాలపై ఈ ఎన్నికల ఫలితాల ప్రభావమేంటి, టీవీకే విజయం నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోగలవా?

  2. విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన కరూర్‌ జిల్లాలో ఏ పార్టీకి ఫలితాలు ఎలా వచ్చాయంటే..

  3. విశాఖ: యారాడలో ఫిషింగ్ జెట్టీ గురించి స్థానికులు కొందరిలో ఆగ్రహం, మరికొందరిలో ఆనందం ఎందుకు? అసలేమిటీ జెట్టీ...

  4. 'మెట్ గాలా 2026'లో పలువురు భారతీయుల సందడి..

  5. ఫోర్ సీస్ ఇనిషియేటివ్: సిరియా వేసిన మాస్టర్ ప్లాన్... భారత్‌ ప్లాన్‌కు పోటీ అవుతుందా?

  6. కేరళలో ఎల్డీఎఫ్ ఓటమికి పినరయి విజయన్‌పై వ్యతిరేకతే కారణమా?

  7. ఉమ్మెత్త ఆకులతో పప్పు వండుకుని తిన్నారు, తర్వాత ఏమైందంటే..

  8. జనసేన, టీవీకే: పవన్ కల్యాణ్ సాధించలేనిది విజయ్ సాధించగలిగారా?

  9. హంటావైరస్: ఎలుకల విసర్జితాలు ఎండిపోయి గాలిలో కలిసినప్పుడు, ఆ గాలి పీల్చేవారికి సోకే వైరస్.. క్రూయిజ్ షిప్‌లో మరణాలకు కారణం ఇదేనా?

  10. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎస్ఐఆర్ ప్రభావితం చేసిందా?

  11. తమిళనాడు: హంగ్ అసెంబ్లీ అయితే.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఎవరికి మద్దతుగా నిలుస్తారు?

  12. తప్పిపోయిన గున్న ఏనుగును తరిమేస్తున్న ఏనుగు మందలు, ఆందోళన వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు, అసలేం జరిగింది?

  13. స్టార్‌డమ్ టు చీఫ్ మినిస్టర్.. ఎవరెవరు?

  14. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయానికి 4 ప్రధాన కారణాలు ఇవే..

  15. విజయ్-టీవీకే: డీఎంకే, అన్నా డీఎంకేలను దాటి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం ఎలా సాధించారు?

  16. ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?, (మే 4 రాత్రి 10 గంటలకు)

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం,

    అస్సాంలో భారతీయ జనతా పార్టీ 126 స్థానాలకు గాను 81 స్థానాల్లో ఘనవిజయం సాధించి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాలు గెల్చుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. బి.ఓ.పి.ఎఫ్, ఏ.జి.పి చెరో 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

    కేరళలో కాంగ్రెస్ 63 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష పార్టీలైన సి.పి.ఐ(ఎం) 26 స్థానాల్లో, సి.పి.ఐ 8 స్థానాల్లో గెలుపొందాయి. ఐ.యు.ఎం.ఎల్ కూడా 22 స్థానాలతో తన బలాన్ని నిరూపించుకుంది. కేఈసీ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచింది.

    తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ 96 స్థానాల్లో గెలిచి, మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డి.ఎం.కె 54 స్థానాల్లో గెలిచి 6 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఏ.డి.ఎం.కె 44 స్థానాల్లో విజయం సాధించి, మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో ఇప్పటికే 184స్థానాలను గెలుచుకుని, మరో 23 చోట్ల ముందంజలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి, 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలిచింది.

    కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏ.ఐ.ఎన్.ఆర్.సి 30 స్థానాలకు గాను11 స్థానాల్లో గెలిచి, మరో చోట ఆధిక్యంలో ఉంది. డీఎంకే 5, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల, టీవీకే అభ్యర్థులు 2 చోట్ల గెలిచారు.

  17. ఎంకే స్టాలిన్ ఓటమి: డీఎంకే పరాజయానికి దారితీసిన 5 ప్రధాన కారణాలు

  18. విజయ్ కారు డ్రైవర్ కొడుకు: ఎవరీ శబరినాథన్, ఎంత మెజార్టీతో గెలిచారు?

  19. విజయ్: తమిళనాట 62 స్థానాలలో గెలిచి 45 సీట్లలో ఆధిక్యంలో ఉన్న టీవీకే.. కేరళలో యూడీఎఫ్ విజయం - బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ

  20. పతనం అంచున కమ్యూనిస్టుల చివరి కోట

    కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మెజార్టీ స్థానాలలో ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో కేరళలో కమ్యూనిస్టుల కోట పతనం అంచున నిలబడింది. ఇది కమ్యూనిస్టు పార్టీకి చివరి కోట.

    పశ్చిమ బెంగాల్లో 2011 అసెంబ్లీ ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓటమి తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్కిస్ట్) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ వామపక్ష ఉద్యమానికి ఊపిరిపోసింది.

    కేరళ ప్రజలు దశాబ్దాలుగా ఒకసారి సీపీఎం మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటములను ఎన్నుకుంటూ వచ్చారు. కానీ 2021లో ఈ సంప్రదాయానికి తెరదించుతూ వరుసగా రెండోసారి ఎల్‌డీఎఫ్‌ని ఎన్నుకున్నారు.

    తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం సాధిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సందడిగా ఉన్నారు. వామపక్ష నేతలు వెనుకబడ్డారనే వార్తలు వచ్చినప్పుడల్లా వారు సంబరాలు చేసుకుంటున్నారు.

    ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెనుకంజలో ఉన్నారనే వార్త అక్కడి అతిపెద్ద టెలివిజన్ తెరపై కనిపించగానే కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. 80 ఏళ్ల ఈ వృద్దనేత పరిపాలనాదక్షుడిగానూ, రాజకీయ చాణక్యుడిగానూ పేరుగాంచారు.

    ‘‘ముఖ్యమంత్రి 3,4వేల ఓట్ల తేడాతో వెనుకబడటమంటే ఎల్‌డిఎఫ్ కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో తెలుపుతోంది’’ అని బీబీసీతో కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) సభ్యుడు అలోకవరియవల్లీ అన్నారు.

    కాంగ్రెస్ సీనియర్ నేతలు వీఎస్ సతీశన్, రమేష్ చెన్నితాల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నేతలు రాజీవ్ చంద్రశేఖర్, కె.సురేంద్రన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.