సీబీఐ: మెహుల్ చోక్సీ రెడ్ కార్నర్ నోటీస్ కోసం మళ్లీ అప్పీలు చేస్తాం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించిన రూ.13,000 కోట్ల కుంభకోణంలో మెహుల్ చోక్సీ ప్రధాన నిందితునిగా ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలు నిజం కాదు: కేంద్రం స్పష్టత

    పెట్రోల్, డీజిల్ ధరలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.

    పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 25-28 మేర పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఈ సందర్భంగా కొట్టి పారేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది.

    అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.

  2. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ బూత్ సమీపంలో బాంబు పేలుడు వార్తలు

    పశ్చిమ బెంగాల్‌

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    ముర్షిదాబాద్ జిల్లాలోని డోంకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. దీంతో స్థానికులు బూత్ నంబర్ 217 వద్ద ఓటు వేయడానికి వెళ్లలేకపోయారు.

    బీబీసీ బంగ్లా కథనం ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ముర్షిదాబాద్ పోలీసులు.. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    ముర్షిదాబాద్ జిల్లాలో నౌదా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివనగర్‌లో ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    మరోవైపు, మాల్దా జిల్లాలోని మోతాబారిలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకోగా, వారు ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  4. 'నమాజ్‌‌తో ఆరోగ్య ప్రయోజనాలు’అనే వీడియోతో ట్రోలింగ్‌కు గురైన నమిత థాపర్ ఎవరు?

  5. పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

  6. హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

  7. నందిగ్రామ్‌: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  8. తమిళనాడు ఎన్నికలు 2026: ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?

  9. భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

  10. రూ.20 నోటు వెనక ఉన్న చిత్రం చరిత్రేమిటో తెలుసా?

  11. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో అమెరికా, చైనాలను భారత్ దాటుతుందా?

  12. "పౌర్ణమి వచ్చిందంటే భయమేస్తోంది", అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని స్థానికుల సమస్యలేంటి?

  13. భారత జెండాతో ఉన్న నౌకలపై ఇరాన్ కాల్పులు, అసలేం జరిగిందని ట్రంప్‌కు ప్రశ్న.. ఆయన ఏమన్నారు?

  14. హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై కాల్పులు, ఇరాన్‌ రాయబారికి భారత్ సమన్లు

  15. 'ఆధారాలుంటే తీసుకురండి, మా దగ్గరేమీ మంత్రదండం లేదు’అన్న పోలీసులు', కొడుకు మరణానికి ఆధారాలు సేకరించి తెచ్చిన ఓ అమ్మ కథ..

  16. రష్యా చమురుపై అమెరికా యూ-టర్న్‌.. భారత్‌కు భారీగా కలిసిరానుందా?

  17. తామరకాడతో ఊపిరి తీసుకుంటూ 5 గంటలపాటు చెరువులో దాక్కున్న దొంగ.. చివరకు ఎలా చిక్కాడంటే..

  18. భారతీయుల దగ్గర ఎంత బంగారం ఉంది? భారత్ కంటే ఏయే దేశాల వద్ద ఎక్కువ బంగారం ఉంది?

  19. ‘‘పాకిస్తాన్ బాగా పనిచేస్తోంది’’ - ట్రంప్ ప్రశంసలు, ఇస్లామాబాద్ వెళ్లే అవకాశం ఉందని వెల్లడి

  20. ‘కెనడా వెళ్లడం అవసరమా’ అనే ప్రశ్న ఎందుకు వినిపిస్తోంది? భారతీయ విద్యార్థుల వలసలు ఎందుకు తగ్గుతున్నాయి?