జాతీయ ఉత్తమ నటులుగా సూర్య, అజయ్ దేవ్‌గణ్ ... ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి

నేడు 2020 సంవత్సరానికి సంబంధించి 68వ జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటులుగా తమిళ నటుడు సూర్య, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఎంపికయ్యారు. ఉత్తమ నటి అవార్డ్ అపర్ణ బాలమురళికి దక్కింది.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్: ‘వరిసాగు వద్దు’ అని ముఖ్యమంత్రి ఎందుకన్నారు, ఎల్ నినో ప్రభావమే కారణమా?

  2. ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా?

  3. ఇరాన్‌తో యుద్ధం: అమెరికా దగ్గర ఆయుధాలు ఖాళీ అవుతున్నాయా?

  4. డెలులూ - క్లాక్డ్ ఇట్ - వాస్తెగుణహూయా: పార్లమెంటులో ఎంపీలు కూడా ఈ జెన్ జెడ్ భాష ఎందుకు మాట్లాడుతున్నారు?

  5. కొండవెలగాడ: నాన్న 2010లో.. కొడుకు 2026లో.. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం, రజతం

  6. 'నన్ను వాళ్లు చంపినా చంపొచ్చు.. అయినా, బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నాను' అని షేక్ హసీనా ఎందుకు అన్నారు?

  7. ఆరెస్సెస్, అమిత్ షాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం

  8. ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగితే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తినాలి?

  9. సింహాచలం గిరి ప్రదక్షిణ, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో...

  10. జపాన్ భూకంపం: షాపింగ్ మాల్‌లో పేలుడు, కూలిన వంతెన, ఎంతటి విధ్వంసం జరిగిందంటే...

  11. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ: ఎన్టీఏలో సంస్కరణలకు రాధాకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏమయ్యాయి?

  12. వరదలో కొట్టుకుపోతున్న కారులోంచి అమాంతం దూకేశారు

  13. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై ఐటీ శాఖ ఏమంది?

    నరేంద్ర మోదీ, వీడియో తొలగింపు, మెటా

    ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images

    ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన ఒక పోస్ట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ (మెటా) భారతదేశంలో కొద్దిసేపు తొలగించింది. ఈ వ్యవహారాన్ని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ 'తీవ్ర ఆందోళనకరమైన విషయం' అని వ్యాఖ్యానించారు.

    "ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి ధ్రువీకరించిన కంటెంట్‌ను తొలగించడం తీవ్రమైన విషయం. ఇలా జరిగి ఉండకూడదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో కృష్ణన్ అన్నారు.

    ఈ విషయంలో మెటా సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

    అయినప్పటికీ, "మెటా దీనికి సాంకేతిక లోపాన్ని కారణంగా చూపిస్తోంది, కానీ ఈ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై వారి నుంచి మరిన్ని వివరాలు కోరాం. అసలు ఇలాంటి పరిస్థితి ఎలా తలెత్తిందో అర్థం చేసుకోవడానికి సాంకేతిక స్థాయిలో సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

    భారతదేశంలోని ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటోందని ఐటీ కార్యదర్శి తెలిపారు.

    "ఒకసారి ఖాతా వెరిఫై అయిన తర్వాత, అందులో పోస్ట్ చేసిన కంటెంట్ ఇలాంటి స్వల్ప సాంకేతిక లోపాలు లేదా పొరపాట్ల వల్ల తొలగించకుండా చూసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన సంస్కరణల కోసం ఈ అంశాన్ని మేం నిరంతరం పర్యవేక్షిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

    ప్రధాని మోదీకి చెందిన ఏ పోస్ట్‌ను ఫేస్‌బుక్ తొలగించిందనే విషయమై అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, జులై 23న పోస్ట్ చేసిన ఒక వీడియోను తొలగించారని, అందులో ప్రధాని మోదీ యువతను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని వార్తాసంస్థ 'పీటీఐ' రిపోర్ట్ చేసింది

  14. 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా: పేపర్ లీకేజీలను అడ్డుకునే ప్రతిపాదిత చట్టంలో ఇంకా ఏముంది?

  15. రంపచోడవరం: 'షైనింగ్ స్టార్' అవార్డు సాధిస్తానంటూ చంద్రబాబుకు మాట ఇచ్చి.. అంతలోనే మృతి, అసలేం జరిగింది?

  16. జౌహార్ యూనివర్శిటీ భవనాల కూల్చివేతపై తాత్కాలిక స్టే, విద్యార్థులు ఏమంటున్నారు?

  17. అరుణాచలం: అడుగు వెడల్పున్న ‘మోక్ష మార్గం’లో చిక్కుకుని మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

  18. ఎన్నికల్లో పోటీ వయసు 21ఏళ్లకు తగ్గించాలా...రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కారణమేంటి?

  19. నెతన్యాహును అరెస్టు చేసే అధికారం నాకు లేదు: మమ్దానీ

    అమెరికా, న్యూయార్క్, ఇజ్రాయెల్, నెతన్యాహు

    ఫొటో సోర్స్, Michael M. Santiago/Getty Images

    ఫొటో క్యాప్షన్, న్యూయార్క్ మేయర్

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాటల యుద్ధం లేదా ఆరోపణల పర్వంలో పాల్గొనడంపై తనకు ఆసక్తి లేదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు.

    నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్టు చేయడానికి సంబంధించిన ప్రశ్నలకు మమ్దానీ స్పందించారు.

    అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో చర్చించారా అని అడగ్గా, ట్రంప్‌తో జరిగిన తన సంభాషణను బహిరంగంగా వెల్లడించబోనని మమ్దానీ అన్నారు.

    న్యూయార్క్ ప్రజలందరికీ భద్రత కల్పించడమే తన ప్రాధాన్యత అని స్పష్టంచేశారు.

    నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై మమ్దానీ స్పందించలేదు.

    అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు సెప్టెంబరు చివరిలో తాను న్యూయార్క్ వెళ్తానని నెతన్యాహు చెప్పారు.

    మమ్దానీ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.

    నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే అరెస్టు చేస్తానని గతంలో జోహ్రాన్ మమ్దానీ హెచ్చరించారు.

    ఆ తర్వాత తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) జారీ చేసిన అరెస్టు వారెంట్ ఆధారంగా నెతన్యాహును అరెస్టు చేయడానికి చట్టపరమైన అధికారం తనకు లేదని ఆయన అంగీకరించారు.

  20. ఒంటెలు కూడా తట్టుకోలేనంత వేడి.. చనిపోతున్న ఎడారి ఓడలు