తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో నేడే పోలింగ్
పశ్చిమ బెంగాల్లో తొలి విడత, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలుండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ - బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తుండగా, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.