You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
లైవ్ కవరేజీ
'డిమాండ్లు సాధించాం, దీక్ష ముగిసింది', నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని సీజేపీ విజ్ఞప్తి
తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.
మూడో విడత చర్చల అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో కలిసి సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశంలో మాట్లాడారు.
"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని వారు విజ్ఞప్తి చేశారు.
"ప్రభుత్వం ఇతర డిమాండ్లను కూడా అంగీకరించింది" అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు.
"కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భవిష్యత్తులో ఏ సీజేపీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది" అని ఆయన అన్నారు.
బాధిత కుటుంబాలకు కోటి పరిహారంపై కూడా అంగీకారం కుదిరిందని, చట్టప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని అశుతోష్ రాంకా తెలిపారు.
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని అన్నారు.
"ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ప్రస్తుతం నమోదైన కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్ను పరిగణించడం.
మేమే వారికి ఎఫ్ఐఆర్ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం. రెండో విషయానికి వస్తే.. పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకు కూడా సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా వారికి అందిస్తామని మేం చెప్పాం" అని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...
పాకిస్తానీ సోషల్ మీడియా అకౌంట్లతో తప్పుడు ప్రచారం : దిల్లీ పోలీసులు
పాకిస్తాన్ నుంచి నడుస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి నకిలీ వార్తలను, పూర్తిగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని దిల్లీ సెంట్రల్ డీసీజీ రోహిత్ రాజ్బీర్ సింగ్ అన్నారు.
సీజేపీ నిరసనలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.
ఏజెన్సీల సహకారంతో అలాంటి అకౌంట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘‘పాకిస్తాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి మరిన్ని అకౌంట్లను గుర్తించేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి దిల్లీ పోలీసులు పనిచేస్తున్నారు’’ అని డీసీపీ తెలిపారు.
‘‘ఇప్పటి వరకు అలాంటి 400కి పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్ను గుర్తించి, బ్లాక్ చేశాం. ఈ అకౌంట్లు నిరసనలకు సబంధించి ఏఐ-జనరేట్ చేసిన కంటెంట్ను, డీప్ఫేక్ వీడియోలను, ఎడిట్ చేసిన చిత్రాలను, ఇతర తప్పుదోవ పట్టించే కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నాయి’’ అని చెప్పారు.
'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా ఈ హ్యాండిల్స్లో కొన్ని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో చురుగ్గా పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
‘‘ఈ సోషల్ మీడియా అకౌంట్లు పలువురు సీనియర్ అధికారుల అధికారిక ప్రకటనలను తారుమారు చేసి, వక్రీకరించాయి. అలాగే, విజువల్ కంటెంట్ను మార్చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాయి’’ అని ఆయన చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.
ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.
ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.
ఇది భారత యువత సాధించిన విజయం : ప్రియాంక గాంధీ
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే, నేనింత సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణమేంటంటే.. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన, మన ప్రజల గొంతుకలను అణచివేసేందుకు, తొక్కేసేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసిన వారి నుంచి దేశ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించారని నేను బలంగా విశ్వసిస్తున్నా.
ఇది భారత యువత సాధించిన విజయమని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరి పట్ల నాకెంతో గర్వంగా ఉంది. బయటికి వచ్చి, వారు నమ్మిన దానిపై గట్టిగా నిలబడిన ప్రతి ఒక్కరూ.. మనకు మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే నడిచారు. వారు పూర్తిగా అహింసా మార్గంలోనే పోరాడారు. వారిపై పెల్లెట్ గన్లు ప్రయోగించారు. టియర్ గ్యాస్ వాడారు. లాఠీలతో కొట్టారు. తీవ్రంగా గాయపడినప్పటికీ.. వారెక్కడా లొంగలేదు. బదులుగా ప్రభుత్వమే వారి సంకల్పానికి తలవంచాల్సి వచ్చింది.
ఇది ఈ దేశపు పాలకులందరికీ.. ప్రస్తుత, భవిష్యత్ తరాల వారికి కూడా గుణపాఠం. ప్రజల ఆకాంక్షలను మీరు విని తీరాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సంకల్పమే అత్యున్నతమైనది. దానికంటే మించినది ఏదీ లేదు. ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క నేత, ఏ ఒక్క నియత, ఏ శక్తీ కూడా భారత ప్రజల సంకల్పాన్ని ఆపలేదు. నేడు మన యువత, విద్యార్థులు దీన్ని నిరూపించారు’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్: ఒకప్పుడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి.. ఇప్పుడు అదే వ్యవహారంలో రాజీనామా, విద్యార్థి నేత నుంచి కేంద్ర మంత్రి వరకు..
ఇది ప్రజాస్వామ్య విజయం: సోనమ్ వాంగ్చుక్
కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అభివర్ణించారు.
ఆయన ఎక్స్ పోస్ట్లో “ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం.. నేరుగా వీధుల నుంచే సాధించిన విజయం. శాంతి, ఓర్పు, పట్టుదల సాధించిన విజయమిది. సీజేపీకి, జెన్ జెడ్కు అభినందనలు. భయాన్ని వీడి, దేశం నలుమూలల నుంచి కదిలివచ్చిన పౌరులందరికీ ధన్యవాదాలు. ఇక జవాబుదారీతనంతో.. సంస్కరణల వైపు అడుగులు వేద్దాం” అని ఆయన రాశారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'మనం సాధించాం' అన్న సీజేపీ
రాజీనామా లేఖను ప్రధానికి సమర్పించా : ధర్మేంద్ర ప్రధాన్
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర ప్రదాన్ తన రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించినట్లు తెలిపారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన రాజీనామా డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి.
ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. "జంతర్ మంతర్తో పాటు దేశంలో నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అవకాశం ఇవ్వకూడదు. దేశ సమగ్రతను కాపాడుకోవాలి. విద్యార్థులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. మన పిల్లలు తమ సమయాన్ని చదువుకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, నా రాజీనామా లేఖను గౌరవ ప్రధాన మంత్రికి సమర్పించాను" అని ఆయన అందులో రాశారు.
సోనమ్ వాంగ్చుక్: ‘బాధ, ఆవేదన, కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నా’
‘ఈ శతాబ్దపు విడాకులు’: ఈ కేసులో ఆ బిజినెస్ దిగ్గజం తన మాజీ భార్యకు ఎన్ని వేల కోట్లు చెల్లించాలంటే...
'పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో ఉండకూడదనుకున్న తల్లి', కానీ ప్రసవం తర్వాత ఏం జరిగింది?
కొత్త తరం ప్రశ్నలు అడుగుతోంది, వారికి తార్కికంగా సమాధానం చెప్పాలి - మోహన్ భగవత్
కొత్త తరం ప్రశ్నలు అడుగుతోందని, వాటికి తార్కికంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్న తరుణంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చెప్పిన విషయాలతో వాదించేవాళ్ళం కాదు. మాట్లాడొద్దు అంటే మాట్లాడే వాళ్లం కాదు" అని అన్నారు.
‘‘కానీ ఇప్పుడు అలా లేదు, కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది, వారికి సమాధానాలు చెప్పాలి. నేటి తరానికి మరింత ఆప్యాయత అవసరం. మనం వారితో సమయం గడపాలి. మనం వారితో మాట్లాడాలి. ఈ రోజుల్లో కుటుంబాల మధ్య సంభాషణలు తగ్గిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లతో బిజీగా ఉన్నారు" అని ఆయన అన్నారు.
శుక్రవారం దిల్లీలో జరిగిన 'విశ్వ మాంగళ్య సభ' కార్యక్రమంలో మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులో ఆత్మాహుతి దాడి, 15 మంది మృతి
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులోని టాంక్ జిల్లాలో ఉన్న సైన్యం, పోలీసుల సంయుక్త చెక్ పోస్టు మాంఝీ ఖేల్పై గురువారం రాత్రి ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులతో సహా మొత్తం 15 మంది మరణించారు.
మృతుల్లో ఇద్దరు పోలీసులు, ఒక అటవీ శాఖ అధికారి ఉన్నారు. ఈ దాడి అనంతరం భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
‘‘ఉగ్రవాదులు మొదట చెక్పోస్ట్ భద్రతను ఛేదించుకుని లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ భద్రతా దళాలు వారి ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఆ తర్వాత పారిపోతున్న మిలిటెంట్లను వెంబడించి కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు’’ అని పాకిస్తానీ సైన్యానికి చెందిన మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) తెలిపింది.
‘‘తొలి ప్రయత్నం విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో చెక్పోస్ట్ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. 15 మంది చనిపోయారు. చెక్పాయింట్ పూర్తిగా ధ్వంసమైంది’’ అని ఐఎస్పీఆర్ తెలిపింది.
దిల్లీ నిరసనలు: పెల్లెట్ గన్ అంటే ఏంటి, ఎందుకు వివాదాస్పదంగా మారింది?
92 ఏళ్ల వయసులోనూ సర్జరీలు చేస్తున్న లేడీ డాక్టర్
సోనమ్ వాంగ్చుక్, కాక్రోచ్ జనతా పార్టీ వైఖరుల్లో ఈ వ్యత్యాసం ఎందుకు, నడ్డా చేతులమీదుగా దీక్ష విరమణపై వస్తున్న ప్రశ్నలేంటి?
సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించడాన్ని ఎలా చూడాలి?
సెక్స్ తర్వాత ఎంతసేపటిలో పిల్స్ వేసుకుంటే గర్భం రాదు?