రాజా సింగ్పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు
రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.
లైవ్ కవరేజీ
స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?
పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్)సవరణ బిల్లు ప్రశ్నపత్రాల లీకేజ్లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.
ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
అమెరికాలో కాల్పులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, సియాటెల్లో కాల్పులు అమెరికాలోని సియాటెల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని సియాటెల్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారని తెలిపింది.
నగరంలో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్లో ఈ కాల్పులు జరిగాయి.
కాల్పుల్లో గాయపడ్డ రెండేళ్ల బాలుణ్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. గాయపడ్డవారిలో 56ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
"సియాటెల్ సెంటర్లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. దయచేసి ఆ ప్రాంతానికి దూరంగా ఉండండి" అని సియాటెల్ పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.
ఘటనాస్థలంలో భారీగా పోలీసులు, అత్యవసర సర్వీసులుకు చెందిన వారిని మోహరించినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తోంది.
సియాటెల్ సెంటర్లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఆహార స్టాల్స్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఉంటాయి. దీనికి లక్షలాది మంది హాజరవుతారు.
అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వరుసగా పలుమార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సియాటెల్ టైమ్స్ తెలిపింది.
కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడి నుంచి పరుగులు తీశామని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్తో మాట్లాడిన పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.
మొదట బాణాసంచా పేలుళ్లేమో అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులన్నారు.
‘‘అందరూ పరుగులు తీస్తుండంతో మేమూ వారితో పాటు పరుగెత్తాం. అక్కడి నుంచి దూరంగా వెళ్లాలనుకున్నాం. మేం ఎక్కడ ఉన్నామో తెలుసుకోడానికి స్పేస్ నీడిల్ వైపు చూశాను. నిజంగా చాలా భయమేసింది’’ అని ఓ మహిళ చెప్పారు.
కాల్పుల శబ్దం వినగానే తల్లిదండ్రులు భయపడిపోయారని, పిల్లల చేతులు పట్టుకుని ఎగ్జిట్ గేట్ వైపు పరుగులు తీశారని, అక్కడంతా భయాందోళన నెలకొందని స్థానిక వ్యాపారి చెప్పారు.
కామన్వెల్త్ గేమ్స్: వరుసగా మూడోసారి స్వర్ణం గెలిచిన మీరాబాయి చనూ
ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం పూర్తిగా మానేయాలా? ఎన్నో ప్రశ్నలు - సమాధానాలు
‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ
'పాక్ పాలిత కశ్మీర్'లో చెలరేగిన హింసపై ఐక్యరాజ్యసమితి ఆందోళన, భారత్ వాదనేంటి, పాకిస్తాన్ ఏమంటోంది?
సీజేపీ: వీధి పోరాటం నుంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు.. ఎప్పుడెప్పుడు, ఏం జరిగింది?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసిన ఐదు కారణాలు ఇవేనా?
సముద్ర గర్భంలో దొరికిన 74 ఏళ్ల కిందటి విమాన ప్రమాద శకలాలు, నేటి సేఫ్టీ నిబంధనలకు ఈ యాక్సిడెంటే కారణమంటారు, ఎందుకంటే..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: ఇది మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బా లేక ఒక పెద్ద అవకాశమా?
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు

ఫొటో సోర్స్, Sonu Mehta/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రహ్లాద్ జోషి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆ శాఖ బాధ్యతలను జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాన మంత్రి మోదీ సూచనల మేరకు, విద్యా శాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకి అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఆయన వద్దే పునరుత్పాదక ఇంధన శాఖ పోర్ట్ఫోలియో కూడా ఉంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ముర్ము అధికారికంగా ఆమోదించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సీజేపీ అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించిందా, బాధిత కుటుంబాలకు పరిహారం గురించి ఏం చెప్పారు?
'మనం అనుకున్నది సాధించాం' - అభిజీత్ దీప్కే
'డిమాండ్లు సాధించాం, దీక్ష ముగిసింది', నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని సీజేపీ విజ్ఞప్తి

ఫొటో సోర్స్, PTI
ఫొటో క్యాప్షన్, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది. తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.
మూడో విడత చర్చల అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో కలిసి సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశంలో మాట్లాడారు.
"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని వారు విజ్ఞప్తి చేశారు.
"ప్రభుత్వం ఇతర డిమాండ్లను కూడా అంగీకరించింది" అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు.
"కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భవిష్యత్తులో ఏ సీజేపీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది" అని ఆయన అన్నారు.
బాధిత కుటుంబాలకు కోటి పరిహారంపై కూడా అంగీకారం కుదిరిందని, చట్టప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని అశుతోష్ రాంకా తెలిపారు.
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని అన్నారు.
"ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ప్రస్తుతం నమోదైన కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్ను పరిగణించడం.
మేమే వారికి ఎఫ్ఐఆర్ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం. రెండో విషయానికి వస్తే.. పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకు కూడా సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా వారికి అందిస్తామని మేం చెప్పాం" అని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు, 9 ఫోటోల్లో...
పాకిస్తానీ సోషల్ మీడియా అకౌంట్లతో తప్పుడు ప్రచారం : దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న దాదాపు 400 నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి, బ్లాక్ చేసినట్లు డీసీపీ రోహిత్ తెలిపారు. పాకిస్తాన్ నుంచి నడుస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి నకిలీ వార్తలను, పూర్తిగా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని దిల్లీ సెంట్రల్ డీసీజీ రోహిత్ రాజ్బీర్ సింగ్ అన్నారు.
సీజేపీ నిరసనలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు.
ఏజెన్సీల సహకారంతో అలాంటి అకౌంట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘‘పాకిస్తాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఈ నిరసనలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇలాంటి మరిన్ని అకౌంట్లను గుర్తించేందుకు సంబంధిత ఏజెన్సీలతో కలిసి దిల్లీ పోలీసులు పనిచేస్తున్నారు’’ అని డీసీపీ తెలిపారు.
‘‘ఇప్పటి వరకు అలాంటి 400కి పైగా సోషల్ మీడియా హ్యాండిల్స్ను గుర్తించి, బ్లాక్ చేశాం. ఈ అకౌంట్లు నిరసనలకు సబంధించి ఏఐ-జనరేట్ చేసిన కంటెంట్ను, డీప్ఫేక్ వీడియోలను, ఎడిట్ చేసిన చిత్రాలను, ఇతర తప్పుదోవ పట్టించే కంటెంట్ను వ్యాప్తి చేస్తున్నాయి’’ అని చెప్పారు.
'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా ఈ హ్యాండిల్స్లో కొన్ని తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో చురుగ్గా పనిచేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
‘‘ఈ సోషల్ మీడియా అకౌంట్లు పలువురు సీనియర్ అధికారుల అధికారిక ప్రకటనలను తారుమారు చేసి, వక్రీకరించాయి. అలాగే, విజువల్ కంటెంట్ను మార్చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాయి’’ అని ఆయన చెప్పారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఏమన్నాయంటే..

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రతిపక్ష నాయకులు స్వాగతించారు. ఇది యువత నేతృత్వంలో సాగిన ఉద్యమ విజయంగా అభివర్ణించారు.
ఇది "దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని కోరుతూ వీధుల్లోకి వచ్చిన మన లక్షలాది మంది యువత సాధించిన విజయం" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ దీనిని, "దేశ యువత సమైక్య బలంతో సాధించిన ఒక భారీ విజయంగా అభివర్ణించారు. ఆయన ఎక్స్ పోస్టులో "అణచివేతకు భయపడకుండా అన్యాయానికి వ్యతిరేకంగా యువత బలంగా నిలబడి, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించేలా చేసిన ఈ పోరాటం. ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తుంది" అని రాశారు.
ఇది "యువత సాధించిన పెద్ద విజయం" అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, భవిష్యత్తులో పేపర్ లీక్లను అరికట్టడానికి, పరీక్షా విధానాలను బలోపేతం చేయడానికి ఈ ఘటన అన్ని రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా ఉపయోగపడాలని అభిలషించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిని "ప్రజాస్వామ్యానికి దక్కిన భారీ విజయం"గా అభివర్ణించారు.
ఇది భారత యువత సాధించిన విజయం : ప్రియాంక గాంధీ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే, నేనింత సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణమేంటంటే.. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించిన, మన ప్రజల గొంతుకలను అణచివేసేందుకు, తొక్కేసేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసిన వారి నుంచి దేశ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించారని నేను బలంగా విశ్వసిస్తున్నా.
ఇది భారత యువత సాధించిన విజయమని నా ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఒక్కరి పట్ల నాకెంతో గర్వంగా ఉంది. బయటికి వచ్చి, వారు నమ్మిన దానిపై గట్టిగా నిలబడిన ప్రతి ఒక్కరూ.. మనకు మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే నడిచారు. వారు పూర్తిగా అహింసా మార్గంలోనే పోరాడారు. వారిపై పెల్లెట్ గన్లు ప్రయోగించారు. టియర్ గ్యాస్ వాడారు. లాఠీలతో కొట్టారు. తీవ్రంగా గాయపడినప్పటికీ.. వారెక్కడా లొంగలేదు. బదులుగా ప్రభుత్వమే వారి సంకల్పానికి తలవంచాల్సి వచ్చింది.
ఇది ఈ దేశపు పాలకులందరికీ.. ప్రస్తుత, భవిష్యత్ తరాల వారికి కూడా గుణపాఠం. ప్రజల ఆకాంక్షలను మీరు విని తీరాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సంకల్పమే అత్యున్నతమైనది. దానికంటే మించినది ఏదీ లేదు. ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క నేత, ఏ ఒక్క నియత, ఏ శక్తీ కూడా భారత ప్రజల సంకల్పాన్ని ఆపలేదు. నేడు మన యువత, విద్యార్థులు దీన్ని నిరూపించారు’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.
