You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎందుకు జరిగింది, అక్కడ దశాబ్దాలపాటు పని చేసినవారు ఏం చెబుతున్నారు?

  2. విశాఖ స్టీల్ ప్లాంట్‌: మరుగుతున్న ఉక్కు చిమ్మడంతో 8 మంది మృతి

  3. మానవ్ సుతార్: ఆడిన తొలి టెస్ట్‌, మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్.. ‘రాజస్థాన్ జడేజా’ అని ఎందుకంటున్నారు?

  4. మాంసం తినే పరాన్నజీవి స్క్రూవర్మ్‌ వ్యాప్తి అరికట్టేందుకు ఈగలు, కుక్కలను ఉపయోగిస్తున్న అమెరికా

  5. ‘నువ్వు అబద్ధాలకోరువైనా అయ్యుండాలి, లేదా నీది మూర్ఖత్వమైనా అయ్యుండాలి’- అంటూ లేచి వెళ్లిపోయిన ట్రంప్

  6. బ్రహ్మోస్: ఈ మిసైల్‌ను కొనడానికి వియత్నాం, ఇండోనేషియా ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి?

  7. ‘దేవాన్ష్‌’ పుష్కర ఘాట్‌పై జరుగుతున్న చర్చ ఏంటి, అసలేం జరిగింది?

  8. ‘‘మా షిప్ మీదుగానే క్షిపణులు దూసుకెళ్లేవి’’-హార్ముజ్ జలసంధిలో నెలల తరబడి చిక్కుకుపోయిన నావికుల భయానక అనుభవాలు

  9. రజత్ పాటీదార్‌కు టీమిండియాలో చోటు దొరకలేదు ఎందుకు? భారత టీ 20 క్రికెట్ జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకు?

  10. తృణమూల్‌లో తిరుగుబాటు: పార్టీ ముక్కలు కాకుండా మమత వ్యూహాలేంటి?

  11. దిల్లీ అగ్ని ప్రమాదం: వైద్యం కోసం విదేశీయులు ఇండియాకు ఎందుకు వస్తున్నారు?

  12. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా: క్యాసెట్ల కాలం నుంచి నేటి రీమిక్స్‌ల వరకు.. తరగని క్రేజ్

  13. భారత ‘రాకెట్ ఉమన్’ ధరించిన చీర అమెరికా మ్యూజియంలో...

  14. యూనిఫాంలో ఉన్న ఆర్మీ కెప్టెన్ సైనిక హెలికాప్టర్ ముందు కాబోయే భార్యకు ప్రపోజ్ చేయడంపై సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతోంది?

  15. చమురు సంస్థలు లాభాలు ప్రకటిస్తున్నా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  16. మైక్రో డ్రామా: షార్ట్ సిరీస్‌లలో అశ్లీలత, హింస, విలాసాల ప్రదర్శనపై చైనా ఆంక్షలు

  17. ఆసియా కప్ హాకీ: భారత అండర్-18 పురుషుల జట్టుకు స్వర్ణం.. మహిళల జట్టుకు కాంస్యం

    జపాన్‌లో జరిగిన అండర్-18 ఆసియా కప్ 2026లో భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించగా, మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

    మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 తేడాతో ఓడించగా, పురుషుల జట్టు 4-1తో జపాన్‌పై విజయం సాధించింది.

    భారత జట్ల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

    "కాంస్య పతకం గెలుచుకున్న భారత మహిళా అండర్-18 హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతమైన ప్రతిభను కనబరిచింది" అని మోదీ ఎక్స్ పోస్టులో తెలిపారు.

    అలాగే స్వర్ణ పతకం సాధించిన పురుషుల జట్టుకు కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.

  18. మీమ్‌ టు మూవ్‌మెంట్: జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏం జరిగింది?

  19. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద రికార్డు

    భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ సాధించాడు.

    టోర్నమెంట్ చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కైమర్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. మొత్తం 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో నార్వే చెస్ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

    ఈ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించాడు.

    చివరి నాలుగు రోజుల్లో అలీరెజా ఫిరౌజ్జా, కార్ల్‌సన్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లపై విజయాలు సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.

    ప్రజ్ఞానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు.

  20. భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ: సూర్యకుమార్‌కు దక్కని చోటు, కెప్టెన్‌గా శ్రేయస్

    15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్ 2026 కోసం శనివారం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఈ యువ ఆటగాడికి తొలిసారిగా చోటు దక్కింది.

    సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియా సమావేశంలో ఈ జట్లను ప్రకటించారు. ఈ ఎంపికలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించగా, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే, తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. మరోవైపు హార్దిక్ పాండ్యాకూ జట్టులో చోటు దక్కలేదు.

    ఏషియన్ గేమ్స్ కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.

    ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.