You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి భేటీ

    దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం '7 లోక్ కల్యాణ్ మార్గ్' వెలుపల రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    కాగా, ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను కలవడానికి కొద్దిసేపటి కిందట కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడకు చేరుకున్నారు. ధర్నా స్థలం నుంచి వస్తున్న దృశ్యాలలో జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో మాట్లాడుతుండటం కనిపించింది.

    రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ "నిన్న విద్యార్థులపై జరిగిన క్రూరమైన దాడికి సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం రాబట్టేందుకు మేం ఆయన ఇంటి వరకు మార్చ్ నిర్వహించాం. ప్రభుత్వం జవాబుదారీతనం వహించడానికి ఇష్టపడట్లేదు. పార్లమెంట్‌లో దీనిపై చర్చను కూడా కోరుకోవట్లేదు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలి" అని తెలిపారు.

    మరోవైపు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనను కొనసాగిస్తోంది. సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' పై సోమవారం లాఠీచార్జ్ జరిగింది. ఈ ఘటనలో పలువురు యువకులు గాయపడ్డారు.

    ఈ నేపథ్యంలో, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి ఒక ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటన ప్రధాని మోదీ నుంచి నేరుగా రాలేదు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ద్వారా వచ్చింది.

  2. నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

    వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం.. ఎన్డీఏ ఎంపీలతో నిర్వహించిన 'మంగళ్ మిలన్'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు.

    సమావేశం అనంతరం, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రసంగం గురించి మీడియాకు తెలియజేశారు.

    ‘నీట్ పరీక్షకు సంబంధించి, అవకతవకలు జరిగినట్లు నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని, పదమూడు మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ప్రధానమంత్రి చెప్పారు" అని కిరణ్ రిజిజు చెప్పారు.

    ‘విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యమిస్తూ పరీక్ష మళ్లీ నిర్వహించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ఫలితాలను ప్రకటించామని ప్రధాని మోదీ అన్నారు. పేపర్ లీక్ వంటి సంఘటనలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు’ అని రిజిజు చెప్పారు.

    పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తెలుపుతున్న సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  3. 'ఆడపిల్లలపై లాఠీ ఎత్తితే, నేను లాఠీ పడతా. కేసు పెట్టుకో'

  4. సీజేపీ నిరసనలు: మద్దతుదారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్.. పార్లమెంట్ దగ్గర ఏం జరిగింది?

  5. హార్ముజ్‌పైనే పీటముడి.. నిలవని ఒప్పందం ఏం చెబుతోంది?

  6. లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ వశం

  7. ‘మా కుటుంబాన్ని ఆదుకోవడానికి అక్క లండన్‌కు వెళ్లింది, కానీ ఆమెకు జరిగింది మరెవరికీ జరగకూడదు’

  8. రోహిత్ శర్మ: హిట్‌మ్యాన్ 'రిటైర్మెంట్' ఊహాగానాలకు బీజం పడింది ఎక్కడ?

  9. కశ్మీర్: స్కూల్ పుస్తకాల్లో 'వేర్పాటువాదులను' కీర్తించేలా పాఠాలు ఉన్నాయా, అధికారుల తాజా ఆదేశాలపై చర్చ ఏంటి?

  10. గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రగా చేసి దాడి, 9 మంది అరెస్ట్

  11. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్.. ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు

  12. సోనమ్ వాంగ్‌చుక్‌ : ఆస్పత్రిలో ఎలా ఉన్నారు, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

  13. భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లతో పోలిస్తే దీని ప్రత్యేకతలేంటి?

  14. విక్రమ్ -1 : నింగిలోకి దూసుకెళ్లిన భారత ‘తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్’.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..

  15. గ్యారీ సోబర్స్: 12 వేళ్లు, ఒకే ఓవర్లో 6 సిక్సులు, 365 పరుగుల రికార్డ్ ఇన్నింగ్స్, భారతీయ నటితో నిశ్చితార్థం.. ఈ క్రికెట్ దిగ్గజం జీవితంలో ఎన్నో విశేషాలు

  16. పొట్టి శ్రీరాములు 'ఆమరణ నిరాహార దీక్ష' భారత దేశ చిత్రపటాన్నే మార్చేసింది.. ఇది ఇప్పటికీ రాజకీయాలను మార్చగలదా?

  17. ఏపీలో కోవిడ్ కలవరం: 12 కేసులు.. నలుగురు మృతి.. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందా?

  18. మూవీ రివ్యూ: 'ఓ సుకుమారి' ఎలా ఉంది.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ నటన ఆకట్టుకుందా?

  19. ‘మిస్టర్ మిడిల్‌క్లాస్’ మూవీ రివ్యూ: అంతా మంచి నటులే, మరి.. ప్రేక్షకుల సహనానికి ఎందుకింత పరీక్ష?

  20. గూగుల్ డేటా సెంటర్‌ను మూడు ప్రాజెక్టులుగా ఎందుకు చూపించారు? పర్యావరణ అనుమతులు అంత వేగంగా ఎలా వచ్చాయి?