You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ తీరుపై మహువా మొయిత్ర అసంతృప్తి
సోనమ్ వాంగ్చుక్ తన నిరాహార దీక్ష విరమించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆమె ‘ఎక్స్’లో వరుస పోస్ట్లు పెట్టారు.
ప్రభుత్వం ట్రాప్లో పడొద్దంటూ ఆమె వాంగ్చుక్కు సూచించారు.
నిరాహార దీక్ష తరువాత.. విద్యార్థుల ఆందోళనలను ఆపడానికి ప్రభుత్వం మీ వాయిస్ను ఉపయోగించకుండా చూసుకోవాలని ఆమె వాంగ్చుక్కు సూచించారు.
విద్యార్థుల నిరసనలపై సోనియా గాంధీ ఏమన్నారు?
విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, సంస్కరణలు కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారని, అయితే వారి ధైర్యానికి మోదీ ప్రభుత్వం "పిరికితనం, క్రూరత్వంతో" సమాధానమిచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం అన్నారు.
"ప్రభుత్వం విద్యార్థులను దేశ భవిష్యత్తును నిర్మించే పౌరులుగా కాకుండా, దేశానికి శత్రువులుగా చూసింది" అని సోనియా అన్నారని పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.
మోదీ ప్రభుత్వం భారతదేశ విద్యా వ్యవస్థను బలహీనపరిచిందని సోనియా ఆరోపించారు. దేశ విద్యార్థులు మోదీ ప్రభుత్వ వాదనలను, అహంకారాన్ని బట్టబయలు చేశారని ఆమె అన్నారు.
విద్యార్థులకు అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం మన నైతిక, రాజకీయ, రాజ్యాంగ బాధ్యత అని సోనియా గాంధీ అన్నారు.
నీట్-యూజీ పరీక్ష పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
అయితే, ఈ డిమాండ్కు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తన దీక్షను విరమించారు.
మూవీ రివ్యూ: ఇది ‘లేడీ దేవదాస్’ కథా?
దోమలపై యుద్ధానికి రంగంలోకి సైన్యం, మిలటరీ డ్రోన్లు.. శ్రీలంకలో ఏం జరుగుతోంది?
కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రభుత్వంతో చర్చలు - సౌరవ్ దాస్
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ డిమాండ్లన్నీ యథాతథంగానే ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. వాటిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.
"తటస్థ వేదికపై చర్చలు జరపాలన్న మా డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించింది. మాకు సంతోషంగా ఉంది. చర్చల కోసం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేశారు. ప్రభుత్వం విశాల దృక్పథంతో మా ముందుకు వచ్చినందుకు, వీధుల్లోకి వచ్చిన ప్రజల మాట వినడానికి సుముఖంగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది" అని సౌరవ్ దాస్ చెప్పారు.
"వారు జంతర్ మంతర్కూ వచ్చుండొచ్చు. కానీ మేమే ప్రత్యామ్నాయంగా తటస్థ వేదికను సూచించాం. వారు జంతర్ మంతర్కు రావడానికి సంకోచించవచ్చని మాకు అర్థమైంది. మేము చదువుకున్న, తెలివైన వ్యక్తులం. అందుకే ఈ తటస్థ వేదికను ప్రతిపాదించాం" అని ఆయన తెలిపారు.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మరికొన్ని డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నెల రోజులకు పైగా దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు.
అయితే ఈ డిమాండ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.
సోనమ్ సర్ దీక్షను విరమించడం సంతోషంగా ఉంది - అభిజిత్ దీప్కే
సోనమ్ వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి తర్వాత తన నిరాహార దీక్షను విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.
సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణపై అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో ఓవీడియో విడుదల చేశారు.
"సోనమ్ సర్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించడం మాకు ఉపశమనం, సంతోషాన్ని కలిగించింది. సర్.. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి, యావత్ దేశ మనస్సాక్షిని కదిలించారు. మీ జీవితం ఈ దేశానికి చాలా విలువైనది" అని అందులో రాశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుందని తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీక్కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్కు మద్దతుగా సోనమ్ వాంగ్చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్లతో పాటు లేహ్-లడఖ్ అపెక్స్ బాడీకి చెందిన సీనియర్ నాయకుల సమక్షంలో తాను నిరాహార దీక్ష విరమించినట్టు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
"గతంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు నిరాహార దీక్ష విరమించాలని కోరుతూ ఒక లేఖ రాశారు" అని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు.
దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, అనేక షరతులపై సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
"ఈ షరతులను నేను త్వరలోనే ఒక ప్రత్యేక వీడియోలో వివరంగా వివరిస్తాను. ఈలోగా మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి హింస జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను" అని ఆ పోస్ట్లో రాశారు.
నీట్-యూజీ పేపర్ లీక్కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్కు మద్దతుగా సోనమ్ వాంగ్చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీబీసీ న్యూస్ తెలుగు వెబ్సైట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.
నమస్తే
ఈరోజు బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
తాజా వార్తల కోసం రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు గురువారం సాయంత్రం ఎట్టకేలకు తీస్ జనవరి మార్గ్లోని గాంధీ స్మృతివనానికి చేరుకున్నారు.
అక్కడ, నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నివాళులర్పించారు.
"మహాత్మా గాంధీ ఇక్కడే హత్యకు గురయ్యారు. ఈరోజు మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. దీనిని ప్రతిపక్షం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోదు" అని రాహుల్ గాంధీ అన్నారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను క్యాబినెట్ నుంచి ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం మోదీ ప్రభుత్వానికి కష్టతరమా?
ప్రతిపక్ష నేతలతో కలిసి గాంధీ స్మృతి వనానికి బయలుదేరిన రాహుల్ గాంధీ, అడ్డుకున్న పోలీసులు
ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలిసి ఇండియా గేట్కు వెళ్లాలనుకున్నానని, అయితే తమకు అనుమతి నిరాకరించారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
“విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు, ప్రతిపక్ష ఎంపీలందరూ కూడా వీధుల్లోకి రావాలని భావించారు. అందరం కలిసి ఇండియా గేట్ వద్దకు వెళ్లాలని అనుకున్నాం” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
"కానీ, పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత, మేం తీస్ జనవరి మార్గ్(మహాత్మా గాంధీ స్మృతివనం)కు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పాం. కానీ, పోలీసులు బస్సును నిలిపేశారు” అని రాహుల్ పోస్ట్ చేశారు.
ప్రతిపక్ష ఎంపీలు గాంధీ స్మృతి వనానికి వెళ్తున్నట్లు రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ నివాసం వెలుపల పోలీసులను భారీగా మోహరించారు.
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, ఎంపీ ప్రమోద్ తివారీ, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి సహా పలువురు నాయకులు రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రాహుల్ గాంధీ నివాసానికి విచ్చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, "రాహుల్ గాంధీ మమ్మల్ని టీకి ఆహ్వానించారు, అందుకే వచ్చాను" అని చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు. “ఈ సమస్యపై ఇండి కూటమి కలిసి పోరాడుతోంది” అని ఆమె చెప్పారు.
రాహుల్ గాంధీ ఇంటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించిందని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి సేన్నిమలై చెప్పారు.
జంతర్ మంతర్: వాష్రూమ్స్, ఫుడ్, మెడిసిన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నామంటే..
ప్రభుత్వంతో సీజేపీ చర్చలు జరగకపోవడానికి కారణమదేనా?
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను గురువారం చర్చలకు ఆహ్వానించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నివాసం లేదా కార్యాలయంలో చర్చలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, చర్చల వేదికపై సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అభ్యంతరం వ్యక్తం చేశారు. "చర్చలు తటస్థ ప్రదేశంలో జరగాలి" అని అన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "జంతర్ మంతర్కు రావడానికి వాళ్లు భయపడుతున్నారు. అందుకే, మీ నివాసం లేదా జంతర్ మంతర్ కాకుండా మరోచోట చర్చలు జరగాలని వారికి సూచించాం" అని ఆయన అన్నారు.
"కానీ, జితేంద్ర సింగ్ మాత్రం జేపీ నడ్డా నివాసం లేదా ఆయన కార్యాలయంలో చర్చలు జరుపుదామని అంటున్నారు."
చర్చావేదిక విషయంలో సీజేపీ, ప్రభుత్వానికి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు.
ఎల్హెచ్ఎస్ 1140 బీ: సౌర కుటుంబం అవతల భూమిలాంటి గ్రహంపై వాతావరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ప్రీటర్మ్ డెలివరీ: నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు జీవితాంతం సమస్యలు తప్పవా? అపోహలు - సమాధానాలు
జన నాయకుడు మూవీ రివ్యూ: విజయ్ 'చివరి సినిమా' ఎలా ఉంది?
సీజేపీని చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ప్రకటన జారీ చేశారు.
“ప్రభుత్వం తరఫున మేము చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. అవసరమైనంత సమయం ఇవ్వడానికి కూడా సిద్ధం” అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
“సీజేపీ ప్రతినిధులతో చర్చల కోసం ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం నుంచి నాలుగు సార్లు అధికారిక ప్రతిపాదనలు పంపింది” అని కేంద్ర మంత్రి చెప్పారు.
కేంద్రమంత్రి జేపీ నడ్డా కార్యాలయంలో లేదా ఆయన నివాసంలో చర్చలు జరగవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
“మాకెలాంటి భేషజాలు లేవు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా, నేను వ్యక్తిగతంగా చర్చలకు హాజరవుతాం. సంప్రదింపుల ద్వారా పరిష్కారం ఆశిస్తున్నాం” అని ఆయన అన్నారు.
ఎన్ఎస్ఏ కింద దిల్లీ పోలీసు కమిషనర్కు ఇచ్చిన అధికారం ఏంటి?
నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ), 1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులను జారీ చేసే అధికారాన్ని దిల్లీ పోలీస్ కమిషనర్కు కల్పించారు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
ఈ అధికారాన్ని 2026 జూలై 19 నుంచి 2026 అక్టోబర్ 18 వరకు మూడు నెలల కాలానికి మంజూరు చేసినప్పటికీ, ఈ విషయం ఇప్పుడే బహిరంగంగా తెలిసింది.
దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం జరుగుతున్న నిరసనల దృష్ట్యా దీన్ని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు.
జూలై 20న జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్కు మార్చ్ నిర్వహించాలని సీజేపీ పిలుపునిచ్చింది.
దీని తర్వాత, నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో చాలా మంది గాయపడ్డారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ, దాని కార్యకర్తల నిరసన ఇంకా కొనసాగుతోంది.